నవతెలంగాణ-హైదరాబాద్: కూషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఏఈ కాలనీలో ప్రియుడు వంశీ ప్రియురాలిపై కత్తితో దాడి చేశాడు. ప్రేమ విహారం బెడిసి కొట్టడంతో మాట్లాడుకుందామని కాలనీలోకి యువతిని పిలిచాడు. ఇద్దరూ కారులో కూర్చుని మాట్లాడుతుండగానే ప్రియుడు వంశీ ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. దీంతో యువతి కేకలు వేయడంతో స్థానికులు స్పందించి కారు అద్దాలు పగులగొట్టి ఆమెను రక్షించారు. తరువాత వంశీ కత్తితో కడుపులో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన ప్రదేశానికి చేరుకున్న కూషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.