– వ్యవసాయ బావులకు నిలిచిపోయిన విద్యుత్
నవతెలంగాణ – మర్పల్లి
త్రీఫేస్ విద్యుత్ వైరు తెగిపడి పది రోజులుగా గడిచిన విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడంలేదని వెంటనే సరి చేయాలని రైతులు అధికారులను కోరుతున్నారు, మం డల కేంద్రానికి చెందిన బోడపల్లి వీరన్న రైతు పొలంలో విద్యుత్ త్రీఫేస్ వైరు తెగిపడి పది రోజులు గడుస్తున్న సరి చేయడం లేదని దీంతో ముందున్న వ్యవసా యబావులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి పంటలకు నీరు అందించలేక పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,కె రాజయ్య, సుబాకర్, నరసింహారెడ్డి, రవీందర్ రెడ్డి, నర్సింలు, వెంకటయ్య తదితర రైతుల పొలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, తెగిపడ్డ వైరు పత్తి పొలంలో పడి ఉందని ప్రమా దవశాత్తు విద్యుత్ సరఫరా చేస్తే రైతుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని విద్యుత్ అధికారులు వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని వేడుకుం టున్నారు