– టీఎస్పీఎస్సీ చైర్మన్ ను తొలగించి, కొత్తవారిని నియమించాలి
– నిరుద్యోగులకు లక్షరూపాయల నష్టపరిహారం అందించాలి
– తక్షణమే కమీషన్ ప్రక్షాళన చేయాలి
– ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్
నవతెలంగాణ- కంటేశ్వర్
గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష రద్దు కావడం రాష్ట్ర ప్రభుత్వం టిఎస్పిఎస్సి నిర్లక్ష్యానికి నిదర్శనం అని నిరుద్యోగులు చెవులలో పూలు పెడుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం సిగ్గుచేటని టీఎస్పీఎస్సీ చైర్మన్ ను వెంటనే తొలగించి కొత్తవారిని నియమించాలని నిరుద్యోగులకు లక్ష రూపాయల నష్టపరిహారం అందించాలని పరీక్ష రద్దు విషయంలో తక్షణమే కమిషన్ను ప్రక్షాళన చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ ఎఫ్ ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ అధ్వర్యంలో చెవులలో పూలతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ అసమర్థత వల్లే ఈ తప్పిదాలు జరుగుతున్నాయన్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఒకసారి పేపర్ లీకేజీ వలన, రాష్ట్రంలో రెండవ సారీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి వచ్చిందని,మళ్ళీ నిర్వహించిన పరీక్షలో ఓఎంఆర్ షిట్స్ పై అభ్యర్థి హల్ టికెట్ నంబర్ వేయకుండా, బయోమెట్రిక్ తీసుకోకుండా పరీక్షలు నిర్వహించారని, దీనివల్ల అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారని, ఫలితంగా మళ్లీ రద్దు చేశారని అన్నారు. టీఎస్పీఎస్సీ వైఫల్యం కారణంగా అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ని మొత్తం ప్రక్షాళన చెయ్యాలని కోరారు. ప్రస్తుతం ఉన్న టిఎస్పిఎస్సి చైర్మన్ ని, సభ్యులను తొలగించి, కొత్త ఛైర్మన్,సభ్యులను నియమించాలని కోరారు. నష్టపోయిన అభ్యర్థులకు లక్ష రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ లో టి ఎస్ పి ఎస్ సి నిర్వహించే పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ నగర కార్యదర్శి పోషమైన మహేష్ , నాయకులు శివ, సంతోష్, రాము , గ్రూప్ 1 అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.