నవతెలంగాణ – ఐనవోలు: క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి బుధవారం ఐనవోలు హై స్కూల్ నందు జరుగుతున్న తొలిమెట్టు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి సందర్శించి ఉపాధ్యాయులకు శిక్షణ గురించి తగు సలహాలు సూచనలు చేశారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకొని విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంపొందించాలని కోరారు. మండల నోడల్ ఆఫీసర్ డాక్టర్ టి రమేష్ శిక్షణను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థుల్లో చదవడం రాయడం సృజనాత్మకతను పెంపొందించేలా ఈ శిక్షణ ఉన్నదని కావున ఉపాధ్యాయులు శిక్షణ తీసుకున్న తర్వాత విద్యార్థుల్లో ఆ నైపుణ్యాలను పెంపొందించడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐనవోలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాక శ్రీహర్షుడు, పున్నేలు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు మాధవి, రిసోర్స్ పర్సన్స్ చుంచుకాల లింగారావు, అశోక్ వర్ధన్ రెడ్డి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.