చిట్యాల పట్టణంలో పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాలతో కలసి ఆదివారం ఫ్లాగ్ మార్చ్ లో భాగంగా కవాతును నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐ కొలను మహేష్ మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు భద్రత ఏర్పాట్లు, సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇప్పటి నుండే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని అన్నారు.