– జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్
– ఆమనగల్, కడ్తాల్ మండల కేంద్రాల్లో చాకలి ఐలమ్మకు ఘన నివాళి
నవతెలంగాణ-ఆమనగల్
తొలి భూ పోరాటానికి నాంది పలికిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని జిల్లా పరిషత్ గ్రామీణాభివద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు, కడ్తాల్ మండల జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. ఆమనగల్ కడ్తాల్ మండల కేంద్రాలతో పాటు ఆయా గ్రామాల్లో ఆదివారం వీరమాత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కడ్తాల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్ మాట్లాడుతూ ఈ భూమి నాది పండించిన పంట నాది దానిని తీసుకెళ్ళడానికి దొర ఎవ్వడు, నాప్రాణం పోయిన సరే పేదలకు పట్టెడన్నం పెట్టె ఈ భూమి మీకు దక్కనివ్వను అంటూ మాటల్ని తూటాలుగా మార్చి దొరల గుండెలను దడదడ లాడించిన వీరవనిత ఐలమ్మ అన్నారు. అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ అలుపెరుగని పోరాటం చేసిన వీరనారి అని దశరథ్ నాయక్ కొనియాడారు. అంతకు ముందు స్థానిక నాయకులతో కలిసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ రామకష్ణ, నాయకులు భాస్కర్ రెడ్డి, నరసింహ, రమేష్ అయ్యగారు, లాయఖ్ అలి, జహాంగీర్ అలీ, కష్ణయ్య, శేఖర్ పాల్గొన్నారు. ఆమనగల్ లో జరిగిన కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు మద్దూరి ఆనంద్ ,మద్దూరి అయోధ్య, పాతకోట నర్సింహ, వడ్డే వెంకటేష్, నాగిళ్ళ అశోక్, పాతకోట సిరి, చంటి, నాగిళ్ళ జగన్, రమేష్, యాదయ్య, జంతుక అల్లాజీ, అఫ్సర్, గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.