మంథనిలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది.నియోజకవర్గంలోని కాటారం పిఏసిఎస్ చైర్మన్ చల్లా నారాయణరెడ్డి బీజేపీ పార్టీకి రాజీనామా చేసినట్లుగా సోమవారం అర్ధరాత్రి ప్రకటించారు. సీఎన్నర్ బీఆర్ఎస్ టికెట్ ఆశించి బంగపడిన ఆయామ గత నెల 27న కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. మంథని బీజేపీ టికెట్ ఇస్తానన్న అధిష్టానం హామీ నిలుపుకోకపోవడంతో నారాయణరెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి నారాయణరెడ్డి రాజీనామా పత్రాన్ని పంపారు. మంగళవారం బిఎస్పీ పార్టీ ఏడూ రాష్టాల ఇంచార్జి రాజ్యసభ సభ్యులు గౌతమ్ రాంజీ ఆధ్వర్యంలో బీఎస్పీ లో చేరి మంథని నియోజకవర్గ బిఎస్పీ ఎమ్మెల్యే టికెట్ బిపామ్ తీసుకున్నారు. త్వరలో నామినేషన్ దాఖలాలు వేయనున్నట్లుగా సీఎన్నర్ ప్రకటించారు.