![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG-20230911-WA0557-300x169.jpg)
విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి ఈనెల 15న హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నా పోస్టర్ ను ఆవిష్కరించినట్లు టి ఎస్ యు ఈ ఈ యు ( సి ఐ టి యు ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధు, టి ఎస్ ఎస్ పి డి సి ఎల్ కంపెనీ అధ్యక్షుడు చంద్రారెడ్డి లు తెలిపారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ భవన్ వద్ద విద్యుత్ ఉద్యోగుల చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను వెంటనే కన్వర్షన్ చేయాలని, ట్రాన్స్కో సి బి డి, ఎస్ ఎం జి అర్టిసన్ ఉద్యోగులకు గ్రేడ్ 1వేతనాలు ఇవ్వాలని, ట్రాన్స్కో, జన్కో , డిస్కం లోని పెండింగ్ ఆర్టిసన్ కు వెంటనే పర్మినెంట్ ఉద్యోగులుగా విలీనం చేయాలని, పీస్ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 అమలు చేయాలని, కోరుతూ ఈనెల 12, 13న సిద్దిపేట సర్కిల్ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షలు ఉంటాయన్నారు. ఈనెల 15న చలో హైదరాబాద్ ఉంటుందన్నారు. మహాధర్నాను కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి నాగేందర్ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి పల్లె కరుణాకర్, జిల్లానాయకులు నారాయణరెడ్డి, ఇంద్రం, చంద్రారెడ్డి , బుచ్చిరెడ్డి, శ్రీకాంత్, నర్సింలు, విజయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.