![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG-20230909-WA0060-300x139.jpg)
పెందోట బాల సాహిత్య పీఠం సిద్దిపేట వారి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ నందు శనివారం బాల సాహిత్య అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా నుంచి ప్రముఖ రచయిత దారం గంగాధర్ ఎంపిక అవగా శనివారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కీర్తి పురస్కార గ్రహీత, ప్రముఖ బాల సాహితీవేత్త సంగన్నభట్ల చిన్నరామకిష్టయ్య చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్దిపేట సాహితీ వేత్తలు ఇతర జిల్లాల రచయితలు మరియు నిజామాబాద్ జిల్లా కవులు స్వర్ణ సమత, తోగర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.