![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG-20230920-WA0213-300x200.jpg)
– పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచన
నవతెలంగాణ-దుబ్బాక రూరల్ : అక్బర్ పేట్ భూంపల్లి మండలం పరిధిలోని చిట్టాపూర్ గ్రామానికి చెందిన సాయి కుమార్ గౌడ్, ముఖేష్, ఆదర్శ్, వినయ్ , సాయికుమార్, ప్రణయ్ కుమార్, ప్రశాంత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికీ తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, దుబ్బాక లో తిరిగి కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి యువత ముందుడాలని కత్తి కార్తీక గౌడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్నాల్ శ్రీనివాసరావు, మంచాల మల్లేశం, కిరణ్ యాదవ్, ఎల్లం, ఐరేని సాయితేజ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.