ఆశా వర్కర్లకు నిర్ధిష్ట వేతనం రూ.18 వేలు ఇవ్వాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నాకు వెళ్తున్న ఆశ వర్కర్లను అక్రమ అరెస్టులు ఖండిస్తూ స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు పై రాష్ట్ర ప్రభుత్వం విపరీతమైన పని భారం పెంచిందని,వీరికి నిర్ధిష్ట వేతనం రూ.18 వేలు ఇవ్వాలని,ఇతర సమస్యల పరిష్కరించాలని సంబంధిత అధికారులు మంత్రులకు విన్నవించుకున్నా ఫలితాలు లేకపోయిందని అన్నారు. ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని మెడికల్ అండ్ హెల్త్ కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వెళుతున్న ఆశ వర్కర్లను అరెస్టు చేయటం అప్రాజాస్వామికమని అన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ క్రిష్ణ ప్రసాద్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ సీనియర్ నాయకులు భారతి, తిరుపతమ్మ, విష్ణు, సమత, నాగమణి, వాణి, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.