నవతెలంగాణ-శంషాబాద్
పరకాల ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి కూతురు వివాహం శంషాబాద్ ఆర్జిఐ ఎయిర్ పోర్టులోని జిఎంఆర్ ఎరీనాలో ఆదివారం జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ముఖ్యఅతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయనతో పాటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ. ప్రకాష్ గౌడ్, తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.