నవతెలంగాణ – ఆసిఫాబాద్: కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు. కొత్తగా నిర్మించిన జిల్లా పోలీస్ ఆఫీస్ కాంప్లెక్స్కు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అక్కడ రిబ్బన్ కట్ చేసి పోలీస్ ఆఫీస్ కాంప్లెక్స్ను ప్రారంభించారు. అంతకుముందు పోలీస్ కాంప్లెక్స్ ప్రాంగణంలోకి చేరుకోగానే జిల్లా పోలీసులు సీఎంకు గౌరవ వందనం సమర్పించారు. గాల్లోకి కాల్పులు జరిపి ఘనంగా స్వాగతం పలికారు.