నవ తెలంగాణ- నాగోల్:
బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేస్తూ దేశం లో నే అభివృద్ధి లో, ప్రజాసంక్షేమ పథకాల ను అమలు లో మొదటి స్థానం నిలిపిన ముఖ్య మంత్రి కే. సి ఆర్ మూడవ సారి ముఖ్య మంత్రి గా హ్యాట్రిక్ సాధించాలని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస గుప్త అన్నారు. సోమవారం హైదరాబాద్ లోని ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తపేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ లో గ్రేటర్ వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీలక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ వైభవ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి కండువా లతో సత్కరించారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీలక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ వైభవ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అన్నారు. ప్రజలందరూ బాగుండాలని, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రదాత, అపర భగీరథుడు, బంగారు తెలంగాణ నిర్మాత సీఎం కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, హ్యాట్రిక్ సాధించాలని అన్నారు. ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో వారి నాయకత్వం లో సంక్షేమంలో, అభివృద్ధి లో తెలంగాణ ను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. తెలంగాణలో అన్ని వర్గాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం సమాన హక్కులు కల్పిస్తున్నదని అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నదని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు, దళితబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, బీసీలు, ఎస్సీలు, ఎస్టీల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాలకు సమాన న్యాయం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోమిశెట్టి నాగరాజు స్వామి, ప్రెసిడెంట్ శ్రీకాంత్ శేరి, జనరల్ సెక్రెటరీ పెద్ది కార్తీక్ కుమార్, ట్రెసరర్ వెంకటేష్ పోలా, కార్యవర్గ సభ్యులు, ఆర్యవైశ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.