మార్గదర్శి, స్ఫూర్తి ప్రదాత కామ్రేడ్‌ శంకరయ్య

Comrade Shankaraiah was the guide and inspirationకామ్రేడ్‌ ఎన్‌.శంకరయ్య శత జయంతి సందర్భంగా సీపీ ఐ(ఎం) పోలిట్‌ బ్యూరో సభ్యుడు జీ.రామకృష్ణన్‌ జూలై 18, 2021న రాసిన వ్యాసాన్ని, శంకరయ్య మరణానంతరం నివాళులు అర్పిస్తూ పీపుల్స్‌ డెమోక్రసీ పున్ణముద్రించిన వ్యాసం ఇది.
జూలై 15, 1922న జన్మించిన కామ్రేడ్‌ ఎన్‌.శంకరయ్య, ఎన్‌.ఎస్‌గా అందరికీ సుపరిచితుడు. జూలై 15, 2021 తేదీన ఆయన తన వందవ సంవత్సరంలోకి ప్రవేశించాడు. బహుముఖ నాయకునిగా ఆర్థిక, రాజకీయ, సామాజిక, భావజాల, సాంస్కృతిక మొదలైన రంగాలలో తనదైన ముద్ర వేశాడు. రాజకీయ రంగంలో, కుటుంబ జీవితంలో ఒక కమ్యూనిస్ట్‌గా ఉండడం ఎలా అని చెప్ప డానికి ఆయన జీవితం ఒక నమూనా. అదే, మనకు మార్గ నిర్దేశం చెయ్యడం, స్ఫూర్తినివ్వడం కొనసాగిస్తుంది.
శంకరయ్య యువకుడుగా ఉన్న రోజుల్లో, సామాజిక సంస్కరణలు, నాస్తికత్వ విధానాలతో ఆత్మగౌరవ ఉద్య మం వైపు ఆకర్షితుడయ్యాడు. ఆ సమయంలో, కమ్యూ నిస్ట్‌ పార్టీ మాత్రమే సంపూర్ణ స్వాతంత్య్రం నినాదాన్ని ముందుకు తీసుకొని వచ్చింది. శంకరయ్య ఈ పరిణా మాలన్నిటినీ గమనించి, ఆర్థిక సమానత్వంతో కూడిన కుల రహిత సమాజానికి దారితీసే సామాజిక మార్పే దీనికి పరిష్కారమనీ, ఈ లక్ష్యం దిశగా మానవాళిని నడి పించేది కూడా మార్క్సిజం మాత్రమే అనే నిర్ణయానికి వచ్చాడు. కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడే శంకరయ్య కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (సీపీఐ) సభ్యుడు అయ్యాడు. మధురై జిల్లాలో ఏర్పడిన మొట్టమొదటి పార్టీ శాఖ కూడా ఇదే.
రాజకీయ ఖైదీగా
మధురైలోని అమెరికన్‌ కళాశాల విద్యార్థి సంఘానికి శంకరయ్య అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. అతికొద్ది కాలంలోనే ఆయన రాష్ట్రస్థాయి విద్యార్థి నాయకునిగా గుర్తింపు పొందాడు. పోలీసులు అరెస్ట్‌ చేసిన అన్నామలై విశ్వవిద్యాలయం విద్యార్థులపై జరిగిన హింసాత్మక దాడు లను ఖండిస్తూ ఒక శక్తివంతమైన కరపత్రాన్ని ఆంగ్లంలో రాసాడు. వాటిని విస్తృతంగా పంపిణీ చేయడం జరిగింది. ఆ దృశ్యాన్ని ఆయన ఇలా స్పష్టంగా వివరించాడు: ”తలలు పగుల గొడుతున్నారు, ఎము కలు ముక్కలుగా విరగ్గొడుతున్నారు, అన్నామలై విశ్వవిద్యాలయంలో రక్తపు నది ప్రహిస్తుంది”. వార్షిక పరీక్షలకు కేవలం 15 రోజుల ముందే పోలీసులు శంకరయ్యను అరెస్ట్‌ చేసి, జైలుకు పంపారు. పద్దెనిమి నెలల తర్వాత మాత్రమే ఆయన్ను విడుదల చేశారు.
శతాబ్దాల తరువాత ఆయనను ఈ ప్రశ్నను అడిగాను : ”మీరు న్యాయవాది అవ్వాలని మీ నాన్నగారు కోరుకున్నారు. ఫైనల్‌ పరీక్షలకు కేవలం పక్షం రోజుల ముందే మీరు అరెస్ట్‌ అయ్యారు. అంటే మీరు మీ చదువు కొనసాగించరు, లా డిగ్రీ సాధించరు, న్యాయవాది అవ్వరని అర్థం. ప్రభుత్వం మిమ్మల్ని ఎప్పుడు విడుదల చేస్తుందో స్పష్టంగా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో, పోలీసులు మిమ్మల్ని అరెస్ట్‌ చేసినప్పుడు, మీ మానసిక స్థితి ఏంటి?
ఆయన సమాధానం ఇలా ఉంది : ”నేను స్వాతంత్య్ర పోరా టంలో పాల్గొన్నందుకు అరెస్ట్‌ చేసి, జైలుకు పంపిన ప్రక్రియ నాకు ప్రేరణ ఇచ్చింది. నేను దేని గురించి కూడా బాధపడలేదు.”
జైలు నుంచి విడుదల అవడంతో, శంకరయ్య కమ్యూనిస్ట్‌ పార్టీ మధురై జిల్లా కమిటీకి కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. మధురై జిల్లా పార్టీ చరిత్రలో 1943 నుండి 1947 వరకు (నాలుగు సంవత్సరాలు) చాలా ముఖ్యమైన కాలం. జిల్లా వ్యాప్తంగా జరిగిన మిలిటెంట్‌ ప్రజా పోరాటాలకు పార్టీ నాయకత్వం వహించింది. అనేక కార్మికవర్గ పోరాటాలు, ఆహారధాన్యాల నిల్వలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్య మాల తర్వాత కామ్రేడ్‌ పి.రామమూర్తి, ఏ.బాలసుబ్రమణ్యన్‌, ఎం.ఆర్‌. వెంకట్రామన్‌, కే.టి.కే.తంగమణి, జానకి అమ్మ లాంటి యోధులతో పాటు శంకరయ్యను 1946లో అరెస్ట్‌ చేశారు. నాయ కులందరినీ మధురై కుట్ర కేసులో ఇరికించారు. నాయకులు ఆగస్ట్‌ 14, 1947 నాడు మాత్రమే ఇతర నాయకులతో పాటు విడుదల అయ్యారు. వారి విడుదల వార్త ముందుగానే తెలియడంతో, వారిని అభినందించడానికి ప్రజలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో నాయకులను సాదరంగా ఆహ్వానించారు.
జైలు, అండర్‌ గ్రౌండ్‌ జీవితం
కామ్రేడ్‌ శంకరయ్య మొత్తం ఎనిమిదేళ్ల జైలు జీవితం గడిపారు. వలస పాలనలో నాలుగేండ్లు, స్వాతంత్య్రానంతర కాంగ్రెస్‌ పాలనలో నాలుగేళ్లు. అండర్‌ గ్రౌండ్‌లో మూడేళ్ల జీవితం గడిపారు. అది, ఆయన ఉద్యమానికి అంకితం చేసిన జీవితం. స్వాతంత్య్ర సమరయో ధులకు ప్రభుత్వం పెన్షన్‌ను ప్రకటించినప్పుడు, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఆయన దానిని తిరస్కరించాడు. దాని గురించి ఎవరైనా అడిగితే, దేశ స్వాతంత్య్రం కోసం జైలుకు వెళ్ళడమే తనకు చాలా విలువైన బహుమానం అని తేలికగా చెప్పాడు.
అండర్‌ గ్రౌండ్‌ జీవితం, జైలు జీవితం చాలా కష్టమైనవి, వినాశనకరమైనవి. ఒక బలమైన, పట్టుదల గల మనస్తత్వం లేకుండా అలాంటి జీవితాన్ని ఎవరూ తట్టుకోలేరు. అయినప్పటికీ, కమ్యూని స్టులు ఈ సవాళ్ళను చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు. శంకరయ్య వేలూరు జైల్లో రాజకీయ ఖైదీగా ఉన్నప్పుడు, ఆయనతో పాటు కమ్యూ నిస్ట్‌ ఖైదీలు రాజకీయ వివక్షకు వ్యతిరేకంగా (కాంగ్రెస్‌ ఖైదీలు, కమ్యూ నిస్ట్‌ ఖైదీలను ‘ఏ’,’బీ’ కేటగిరీలుగా చేయడం) నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. నిరవధిక నిరాహారదీక్ష పదవ రోజున జైలు సూపరింటెం డెంట్‌ జైలు సందర్శించినప్పుడు, శంకరయ్య మాక్సిమ్‌ గోర్కీ రాసిన ‘అమ్మ’ నవలను చదువుతుండడం చూసి, నిరాహార దీక్షలో ఉన్న కమ్యూనిస్టుల మానసిక బలాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు.
పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా:-
1953లో ఉమ్మడి కమ్యూనిస్ట్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు నిగా శంకరయ్య ఎన్నికయ్యాడు. సీపీఐ(ఎం) ఏర్పాటుకు ముందు జరిగిన పార్టీ జాతీయ కౌన్సిల్‌ సమావేశం నుండి బయటకి వచ్చిన 32మంది సభ్యుల్లో శంకరయ్య ఒకరు. 1995లో సీపీఐ(ఎం) తమిళనాడు రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికైన ఆయన ఆ హోదాలో 2002 వరకు పని చేశాడు. రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పట్ల ఆయన చాలా చురుగ్గా జోక్యం చేసుకునే వారు. 1998లో కోయంబత్తూరులో జరిగిన బాంబు పేలుళ్లు, మత ఘర్ష ణలు, 24 మంది ప్రాణాలు కోల్పోడానికి దారితీసాయి. ఈ సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు శంకరయ్య, కామ్రేడ్‌ ఉమానాథ్‌ను కోయంబత్తూరు పంపించాడు. శంకరయ్య, ముఖ్యమంత్రితో సంప్ర దింపులు జరపడంతో పాటు మత ఘర్షణలకు బాధ్యులైన వారిని అరెస్ట్‌ చేసి, రాష్ట్ర వ్యాప్తంగా భద్రతా చర్యలు చేపట్టాలని కోరాడు. కార్మికవర్గ కేంద్రంగా ఉన్న కోయంబత్తూరులో జరిగిన మత ఘర్షణల పట్ల సీపీఐ(ఎం) ఆందోళన చెందిందనీ పేర్కొంటూ, కార్మికవర్గ ఐక్యతను దెబ్బతీసే మతతత్వ శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాడు.
1990 దశాబ్దం ద్వితీయార్థంలో, తమిళనాడు రాష్ట్రంలోని దక్షిణ జిల్లాలలో కులాల మధ్య ఘర్షణలు జరిగిన ఫలితంగా విషాదకరంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. కామ్రేడ్‌ శంకరయ్య అభ్యర్థన మేరకు నాటి ముఖ్యమంత్రి కరుణానిధి అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆ రెండు రోజుల సమావేశానికి శంకరయ్యతో పాటు నేను కూడా హాజర య్యాను. సమావేశం జరుగుతున్న సందర్భంలో శంక రయ్య జోక్యం చేసుకొని, ”మా పార్టీ శ్మశానవాటిక శాంతి కోసం లేదు. ఇప్పుడు మేము మీ ముందుంచుతున్న నినాదాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేప ట్టాలి. రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ఈ ప్రక్రి యలో కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని” అన్నాడు. ఆ నినాదాలు : ”అస్పృశ్యత శాపాన్ని నిర్మూలించాలి, కులాల మధ్య చెలరేగుతున్న ఘర్షణలను అంతం చేయండి, ప్రజల ఐక్యతను కాపాడండి.” కామ్రేడ్‌ శంకరయ్య చేసిన సూచనలను ముఖ్యమంత్రి స్వాగతించాడు.
శాసనసభ్యునిగా
శంకరయ్య తమిళనాడు రాష్ట్ర శాసనసభకు మూడు పర్యాయాలు ఎన్నికయ్యాడు. మొదటిసారి గెలిచినప్పుడు లెజిస్లేచర్‌ పార్టీ డిప్యూటీ నాయకునిగాను, రెండు, మూడో దఫా గెలిచినప్పుడు లెజిస్లేచర్‌ పార్టీ నాయకునిగా పని చేశాడు. విద్య, పాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థలో తమిళ భాషను ప్రవేశపెట్టాలని నొక్కిచెప్పడం, శాసనసభ్యునిగా తాను పోషించిన పాత్ర వలన ఆయనకు మంచి గౌరవం దక్కింది. తమిళ నాడులో రైతు ఉద్యమ నిర్మాణంలో శంకరయ్య కీలకమైన పాత్రను పోషించాడు. ఆయన తమిళనాడు రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడి గానూ, అదేవిధంగా జాతీయ స్థాయిలో అఖిల భారత కిసాన్‌ సభ అధ్యక్షునిగా, కార్యదర్శిగాను సేవలందించాడు. ఉమ్మడి కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రచురించిన జనశక్తి పత్రికకు ఆయన సంపాదకునిగా సేవలందించాడు. సీపీఐ(ఎం) ఏర్పడిన తర్వాత తమిళనాడు రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో నడిచిన ‘తీక్కతిర్‌’ పత్రికకు సంపాదకునిగా కూడా పనిచేశాడు. కళలు, సాహిత్యం అభివృద్ధికి సంబంధించి కూడా ఆయ నకు లోతైన అవగాహన ఉంది. తమిళనాడు ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ యూని యన్‌ ఏర్పాటులో ఆయన కీలకమైన పాత్ర పోషించాడు. తమిళనాడు ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ యూనియన్‌ మహాసభలో ఆయన చేసిన ప్రసంగం, సాహిత్యంలో రూపం, సారంల సాపేక్ష పాత్రలపై జరిగిన చర్చలో ఆయనకున్న అవగాహనను తెలియజేసింది, విస్తతమైన ఆమోదాన్ని కూడా పొందింది.
శంకరయ్య, ఆయన వ్యక్తిగత జీవితానికి కూడా ప్రజాస్వామిక నిబంధనలను అన్వయిస్తూ వచ్చాడు. ఆయన కులవివక్షతను బలంగా వ్యతిరేకించడమే కాక తాను పుట్టిన కుల,మతాలకతీతంగా ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. ఆయనది చాలా పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో చాలావరకు కులాంతర వివాహాలే జరిగాయి.ఇలా జరగడంలో కామ్రేడ్‌ శంకరయ్య పాత్ర చాలా ముఖ్యమైనది. కామ్రేడ్‌ శంకరయ్య జీవితం నేటితరం కార్యకర్తలకు మార్గదర్శకంగా, స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.
(”పీపుల్స్‌ డెమోక్రసీ” సౌజన్యంతో)
అనువాదం : బోడపట్ల రవీందర్‌, 9848412451
జి.రామకృష్ణన్‌