నవతెలంగాణ – సిద్దిపేట : చిన్నకోడూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిట్టపల్లి గణేష్, మైలారం గ్రామానికి చెందిన ఎన్ ఆర్ ఐ శ్రావణ్ రెడ్డి, నంగునూర్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డిలు గురువారం మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీ లోకి మంత్రి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేట అభివృద్ధి మెచ్చుకొనెల చేసుకున్నామని, అన్నింటా అభివృద్ధి చేసుకొని దేశస్ధాయిలో ఆదర్శంగా నిలిచామని చెప్పారు. ప్రతిపక్షాలు సైతం సిద్దిపేట అభివృద్ధి బాగుంది అంటున్నారు కానీ, అభివృద్ధి కాలేదు అనే మాట అనడం లేదన్నారు. మన అభివృద్ధి ని చూసి ఓర్వలేక పోతున్నారన్నారు. సిద్దిపేట అభివృద్ధి లో ఆదర్శంగా నిలిచి అభివృద్ధి సముదాయం సిద్దిపేట అనేల డెవలప్ మెంట్ హబ్ గా చేసుకున్నామని, అభివృద్ధి చూసి ఓర్వలేని వాళ్లకు మన ఓటుతో బుద్ధి చెపుదాం అని, అందరం కల్సి మరింత అభివృద్ధి చేసుకుందామని , పార్టీ బలోపేతం కు పాటు పడదామని సూచించారు.
– చిన్నకోడూర్ మండల కాంగ్రెస్ పార్టీ కి షాక్..
చిన్నకొడూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిట్టపల్లి గణేష్ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. ఆయన తోపాటు అనుచరులు కట్కూరి శ్రీనివాస్, బాలకృష్ణ, నరాల కృష్ణ, బాబు, లక్ష్మణ్, కనకయ్య తదితరులు, అదేవిధంగా నంగునూర్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాగుల మైసయ, శ్రీనివాస్ తదితరులు, అదేవిధంగా చిన్నకోడూర్ మండలం మైలారం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ(అమెరికా) అన్నాడి శ్రావణ్ రెడ్డి తోపాటు ఉపేందర్ ముదిరాజ్, లింగం ముదిరాజ్, అంజి తదితరులు చేరారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ సలహాదారు చందు, సోహెల్, రాకేష్ , ఆకాష్ తదితరులు బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో అయా మండలాల నాయకులు పాల్గొన్నారు.