నవతెలంగాణ -మల్హర్ రావు
ఎన్నికల్లో గెలుపునకు అభ్యర్థులు ఎంత ఖర్చైన భరిస్తారు. ముమ్మరంగా ప్రచారం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారు.అభ్యర్థులు ఎంపిక నుంచి మొదలు ఎన్నికలు పూర్తియ్యేవరకు ప్రచారం హోరెత్తనుంది.ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు అత్యధికంగా పోటీచేసే అవకాశం ఉంది.ఈ క్రమంలో పలువురికి ఉపాది కలగనుంది.
రవాణా సౌకర్యం..
అభ్యర్థులతోపాటు నాయకులు,కార్యకర్తలకు ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి వాహనాలను సమకూర్పుతారు..ఒక్కొక్క వాహనం అద్దె రోజుకు రూ.3వేల నుంచి రూ.4 వేల వరకు యజమానులకు సకూరనుంది.అధిక సంఖ్యలో వాహనాలు మండల కేంద్రాల్లో, పట్టణాల్లో తిరగాల్సి ఉండటంతో ఇంధన వినియోగం పెరిగే అవకాశం ఉంటంది. ఇదే కాకుండా అభ్యర్థుల ప్రచార ప్లెక్సీలు పెట్టుకుని ఆటోలు,జీపులను తిప్పుతుంటారు.
ఫొటోలు, వీడియోలు తీసేందుకు…
అభ్యర్థుల ప్రచార చిత్రాలు తీసేందుకు వీడియో, ఫొటో గ్రాఫర్లకు డిమాండ్ ఉంటుంది.ప్రచారం పూర్తియ్యే వరకు ఒక్కొక్క ఫొటో గ్రాఫర్ రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు చార్జీలు తీసుకుంటారు.సభలు,సమావేశాలు,ప్రచార ర్యాలీలు సమయంలో అభ్యర్థులు సొంత ఖర్చులతో వీరిని నియమించుకొనున్నారు.
కళాకారులతో సందడి..
అభ్యర్థుల సందడి కళాకారుల సందడితో కొత్త శోభను సంతరించుకోనుంది.డప్పు కళాకారులు,పాటలు పాడేవారితో సిసిలు రూపొందించారు.వినూత్న వేషాదరణతో ప్రచారం చేపట్టే వారికి ఆదరణ ఉంటుంది.వారం రోజుల ప్రచారానికి ఒక్కొక్క అభ్యర్థి వద్ద రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు రుసుము తీసుకుంటారు.దీంతో మంథని నియోజకవర్గంలో కళాకారులకి ఉపాది లభించనుంది.
కరపత్రాలు ముద్రణ..
అభ్యర్థుల ప్రచారానికి కరపత్రాలను ప్రదానాస్రాలుగా భావిస్తారు. తమ హామీలను పత్రంపై ముద్రించి పంచె అవకాశం ఉంది.ఒక్కో అభ్యర్థి వేలాది కరపత్రాలకు రంగం సిద్ధం చేస్తారు.ఒక్కో పత్రం రూ.3 నుంచి రూ.5 వరకు ధర పలికినా రూ.లక్షల్లో ఖర్చు చేస్తారు.అభ్యర్థి ఓటర్లకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు జిరాక్స్ కేంద్రాలను ఆశ్రయిస్తారు.ఒక్కో బూత్ పరిధిలో రూ.250 నుంచి రూ.450 వరకు ఓటర్ల జాబితాలను విక్రయించే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.కలర్ జిరాక్స్ జాబితాలను చార్జీలు అదనం.
అల్పాహారం..
ఒక్కో అభ్యర్థికి వందలాది మంది ప్రచారం చేస్తారు. వీరందరికీ ఉదయం అల్పాహారం పెట్టాల్సి ఉంటుంది.ఒక్కొక్క వ్యక్తికి అల్పాహారానికి రూ.25 మధ్యాహ్నం, రాత్రి భోజనం కలిపి రూ.120 ఖర్చు కానుంది. ఈ లెక్కన ఒక్కొక్క వ్యక్తికి రూ.175 నుంచి రూ.200 వరకు ఖర్చు చేయనున్నారు. ఇక క్యాటరింగ్ సేవలకు బారి డిమాండ్ ఉండనుంది.
వాహనాలకు ప్లెక్సీలు..
అభ్యర్థుల ప్రచారానికి సంబంధించిన వాహనాలకు ప్లెక్సీలు ఏర్పాటు చేస్తారు.వాహనానికి మూడు వైపులా ప్లెక్సీ ఏర్పాటు చేయనున్నారు.ఒక్కొక్క ప్లెక్సీ ధర రూ.600 నుంచి రూ.800 వరకు ఉంటుంది. ఈ లెక్కన వాహనానికి రూ.1800 నుంచి రూ.2400 వరకు ఖర్చు అవుతుంది.
ప్రచారానికి టి షర్టులు..
ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల పేర్లు చిత్రాలతో టి షర్టులు ముద్రించి యువకులకు పంపిణీ చేసే వీలుంది.ఏ వీధిలో చూసిన అభ్యర్థి పెరు మార్మోగాలని ఇదో రకం వ్యూహం.ఒక్క టి షర్ట్ రూ.180 నుంచి రూ.250 వరకు ధర పలుకుతోంది.మంథని నియోజకవర్గంలో వేలాది టి షర్ట్స్ ముద్రించే అవకాశం ఉంది. ఈ లెక్కన వీటికి రూ.లక్షల్లో ఖర్చు అయ్యే అవకాశం ఉంది.
కూలీలకు డిమాండ్..
పట్టణాల్లో,గ్రామాల్లో అడ్డా కూలీలతో ప్రచారం చేపట్టే అవకాశం ఉంది.ప్రచారల్లో 800 నుంచి వెయ్యి మంది పాల్గొన్న ఒక్కొక్క కూలీకి రూ.300 నుంచి రూ.400 ఖర్చు చేసిన లక్షల్లో ఖర్చు అయ్యే అవకాశం ఉంది.ఎన్నికల వేళా ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులకు బోనాలతో ప్రచారం చేయడానికి డిమాండ్ ఉండనుంది.ఇక డప్పు,డోలు కళాకారులకు కొదువే ఉండదు.