నవతెలంగాణ- కంటేశ్వర్
భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన హరికిషన్ సింగ్ సూచిత్ 15వ వర్ధంతి సందర్భంగా సీపీఎం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి అదే విధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ కృష్ణమూర్తి వర్ధంతి పురస్కరించుకొని ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు మంగళవారం అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. భారత దేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన హరికిషన్ సింగ్ సూర్జిత్ రైతాంగ ఉద్యమ నిర్మాత భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించి అనేక పోరాటాల్లో అగ్రభాగాన ఉన్న నాయకుడని సిపిఎం పార్టీ ప్రారంభం లో ఒకరుగా ఉంటూ సుదీర్ఘ కాలం పాటు రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శుభాద్యతల్లో మరియు సీపీఎం పార్టీ పోలీస్ బ్యూరో సభ్యులుగా అఖిలభారత ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అనేక ఉద్యమాలు నిర్వహించి కార్మిక వర్గ రాజ్య స్థాపన ద్వారానే దోపిడీ లేని రాజ్యం ఏర్పడుతుందని అందుకు కమ్యూనిస్టు పార్టీ నిర్మాణమే మార్గం అని చివరి వరకు కృషి చేశారని ఆయన చూపిన మార్గంలో నేటికీ అట్టడుగు వర్గాల ప్రజలను కదిలిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఎం పార్టీ పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలకమైన వ్యక్తిగా పనిచేసిన కృష్ణమూర్తిగారు అనేక గ్రామాల్లో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి దున్నేవాడికే భూమి కావాలని నినదించి చివరి వరకు వ్యవసాయ కార్మికుల పక్షాన పేదల పక్షాన పోరాటాలు నిర్వహించారని. వారి ఆశయ లక్ష్య సిద్ధి కోసం నేటికీ సిపిఎం పార్టీ భూ పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద రాములు, ఏం. గోవర్ధన్ జిల్లా కమిటీ సభ్యులు సుజాత, పెద్ది సూరి కళావతి, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.