నవతెలంగాణ – తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం వారాంతపు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు 22 కంపార్ట్మెంట్ లో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న శ్రీ వేంకటేశ్వరస్వామిని 78,115 మంది భక్తులు దర్శించుకోగా 38,243 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.19 కోట్లు వచ్చిందని వివరించారు.