నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూర్ పట్టణంలోని దక్షిణ కాశీ శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయంలో శ్రావణమాసం చివరి శనివారం సందర్భంగా భక్తులు ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ అధికారులు అన్నదాన కార్యక్రమం, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.