నవతెలంగాణ చెన్నై: సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని డీఐజీ ఆత్మహత్య చేసుకున్న ఘటన నేటి ఉదయం 6 గంటల సమయంలో తమిళనాడులో జరిగింది. కోయంబత్తూరు సర్కిల్ డీఐజీ హోదాలో పనిచేస్తున్న సి.విజయ్ కుమార్.. ఆ నగరానికి చెందిన రెడ్ఫీల్డ్స్లోని క్వార్టర్స్లో తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. ఈరోజు ఉదయం ఆరు గంటల సమయంలో డిఐజి తన నివాసంలో తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నారు. తీవ్ర ఒత్తిడే ఆయన మరణానికి కారణమని తెలుస్తోంది. పోస్ట్మార్టం నిమిత్తం కోయంబత్తూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు ఆయన మృతదేహాన్ని తరలించారు. ఈ ఏడాది జనవరి నుంచి విజయ్ కుమార్ డీఐజీ హౌదాలో పనిచేస్తున్నారు.