– శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ కు అభినందనలు..
– హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ..
దివ్యాంగులు దేవునితో సమానమని భావిస్తూ గత 25 సంవత్సరాలుగా శ్రీ గురుదేవా ఛారిటబుల్ ట్రస్ట్ లక్షలాది మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందించడం అభినందనీయమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.శుక్రవారం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత్ పరిషత్ లో శ్రీగురుదేవా ఛారిటబుల్ ట్రస్ట్ పేద దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలను పంపీణీ చేశారు. బీజేపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, సంస్థ మాజీ డైరెక్టర్ మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గవర్నర్ దత్తాత్రేయ. సెంట్రల్ విజిలెన్స్ కమీషనర్ కె.వి.చౌదరి. ఆల్టిక్ వ్యవస్థాపక అధ్యక్షులు రూపుమార్లు పాల్గోని మాట్లాడారు. ఈసందర్భంగా జర్నలిస్టు శంకర్ నారాయణ రచించిన వాల్మీకి శతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆజ్తక్ సేవా సంస్థ సహకారంతో దాదాపు 142 మంది దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు, బ్లైండ్ స్టిక్స్, హ్యాండ్ క్రచెస్, చెవి మిషిన్లు, వీల్చెర్స్, ట్రైసైకిల్స్, పోలియోకాలిపర్స్ వంటివి పంఫిణీ చేయడం అభినందనీయమన్నారు..ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబుకు మనమందరం అన్ని విధాలుగా సహాయపడాలని తెలిపారు. మనం సంపాదించిన దానిలో పేదలకు ఖర్చుపెట్టాలని సభికులకు విజ్ఞప్తి చేశారు. పేదలకు సేవ చేయడమే దేవుని సేవగా ప్రతి ఒక్కరం భావించానలి విజ్ఞప్తి చేశారు. ఇంతటి గొప్ప కార్యక్రమాలను ఛారిటబుల్ ట్రస్ట్ చేయడానికి కారణమైన బృందసభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు ఆర్ధిక బరోసా కల్పించేందుకు విభిన్న పథకాలను ప్రవేశపెట్టాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఉద్యోగ, విద్యలో 4% రిజర్వేషన్లు కల్పించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని గవర్నర్ దత్తాత్రేయ తెలిపారు. ఈ కార్యక్రమంలో గన్ ఫౌండ్రీ కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్. విశ్వేశ్వర్, ప్రతినిధి సుబ్బారావు, యుపిఎస్సీ ఫ్యాకల్టిమెంబర్ మాధురి, జ్యోత్స్న.ఇతర ట్రస్టు సభ్యులు. దివ్యాంగులు తదితరులు పాల్గోన్నారు