![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG-20230921-WA0011.jpg)
మండల కేంద్రానికి చెందిన లింగాల దీలిప్ కుమార్,వర్షిత్ తమ తాతమ్మ లింగాల కనుకవ్వ-మల్లయ్య జ్ఞాపకార్థం సుమారు రూ.5 వేల విలువైన 10 కుర్చీలను స్థానిక గ్రంథాలయానికి గురువారం వితరణ చేశారు. గ్రంథాలయంలోని పాఠకుల సౌకర్యార్థం కుర్చీలను అందజేసిన యువకులను గ్రంథాలయ నిర్వహాకుడు జంగిటి చంద్రయ్య అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.