![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/11/Screenshot_2023_1105_150736.png)
జుక్కల్ ఎస్సీ రిజర్వ్ కాన్స్టెన్సీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుమారి అరుణాతార తమ నామినేషన్ పత్రాన్ని ఈనెల 6న సోమవారం 10 గంటలకు దాఖలు చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ అభ్యర్థిగా అరుణాతారా నామినేషన్ దాఖలకు ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. నామినేషన్ దాఖల కోసం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.