![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG-20230909-WA0018-300x135.jpg)
నవతెలంగాణ- కంటేశ్వర్
తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 13న రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని జిల్లాలోని మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు, మధ్యాహ్న భోజన కార్మికులకు కేరళ తరహాలో రోజుకు 600 రూపాయల చొప్పున నెలకు 18 వేల రూపాయల కనీస వేతనాలను తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు, జిల్లాలో 8 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండగంగాధర్, నాయకులు సురేందర్ రెడ్డి, పర్వావ్వ, తుకారం నాయక్, నాగమణి, బాలరాజు, రేఖ, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.