– దుమ్ము, దూళితో రోగాలు
– బాంబుల దెబ్బలతో కూలుతున్న ఇండ్లు
– విలేకరుల సమావేశంలో భూ నిర్వాసితులు
నవతెలంగాణ -మల్హర్ రావు
బంగారు పంటలు పండే సారవంతమైన భూములు బొగ్గు వెలికితీత కోసం ధారాదత్తం చేస్తే ప్రభుత్వం, జెన్కో సంస్థ తమను మోసం చేస్తోందని మండల కేంద్రమైన తాడిచెర్ల డేంజర్ జోన్ భూ నిర్వాసితులు ఆరోపించారు. తాము నిత్యం ఓసిపి బాంబుల దెబ్బలతో ఇండ్లు కూలుతు, మరోవైపు దుమ్ము, దూళి, రసాయనాలతో రోగాల బారిన పడుతూ బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పదిహేను సంవత్సరాలుగా డేంజర్ జోన్ అభివృద్ధికి నోచుకోక, ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందక నరకయాతన అనుభవిస్తున్నన్నారు.
మరో ఉద్యమానికి సిద్ధం..
తాడిచెర్ల ఓసీపీ బ్లాక్-1కు డేంజర్ జోన్ 500 మీటర్ల దూరంలో ఉన్న ఇండ్లు,భూములు సేకరించి పరిహారం,ఆర్అండ్ఏ ప్యాకేజి ఇవ్వాలని లేదంటే బొగ్గు తవ్వకాలు అడ్డుకొని మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టుగా తాడిచెర్ల భూ నిర్వాసితులు హెచ్చరించారు.భూ నిర్వాసితుల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపంచాయతీ ఆవరణలో డేంజర్ జోన్లో ఉన్న నిర్వాసితులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాసితుల కమిటీ అధ్యక్షుడు దండు రమేష్ తోపాటు పలువురు మాట్లాడారు 20-10-2008 ప్రజాభిప్రాయ సేకరణలో అప్పటి ఎపిజెన్కో సంబంధించిన డైరెక్టర్ తాడిచెర్ల, కాపురం గ్రామాల్లోని భూముల్లో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని, వ్యవసాయ భూములు ఇవ్వాలని, పరిహారం ఇచ్చి బొగ్గు నిక్షేపాలు వెళక్కి తిస్తామని చేప్పినట్లుగా పేర్కొన్నారు. బొగ్గు బావిని ప్రారంభిస్తామని, డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లను, భూములను సెకరిస్తామని తమను జెన్కో అధికారులు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.2010 సంవత్సరంలో ఇండ్లను సేకరిస్తామని 10,88 ఇండ్లకు నెంబర్లు వేసి, ఆర్థిక,సామాజిక సర్వేలు చెసి అధికారులు చేతులు దులుపుకున్నారన్నారు. ఎన్నో పోరాటాలు,ధర్నాలు చేపట్టిన క్రమంలో 2,300 ఎకరాలకు పరిహారం ఒకే విడుతలో ఇవ్వకుండా విడుతల వారిగా 2016లో ఇచ్చి, 2017లో కోల్ మైనింగ్ ప్రారంభించినట్లుగా వాపోయారు.చివరి ప్రయత్నంగా ఓసీపీకి డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లు,భూములు తీసుకోవాలని ఆందోళనలు చేపట్టి టిఎస్ జెన్కో సిఎండి ప్రభాకర్ రావును కలిసి విన్నవిస్తే చేస్తే 359.23 ఎకరాల భూములు, 2,652 ఇండ్లు సేకరిస్తామని 7-4-2021న ప్రిలిమినరి నోటిఫికేషన్ వేసి పది నెలల గడుస్తున్నప్పటికి ఇండ్లకు, భూములకు పరిహారం ఇవ్వలేదన్నారు.నోటిఫికేషన్ ప్రకారం మరో రెండు నెలలు మాత్రమే గడువు ఉన్నప్పటికీ ప్రభుత్వం, జెన్కో అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ ను కలిస్తే జెన్కో సంస్థ డబ్బులు డిపాజిట్ చేస్తే ఇస్తామని,మీరు జెన్కో అధికారులను నిలదీయాలని చెప్పినట్లుగా వాపోయారు. జెన్కో సిఎండిని కలిస్తే మావద్ద అంతా డబ్బు లేదని సీఎం కేసీఆర్ ను కలువండని చెప్పినట్టుగా ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం, జెన్కో సంస్థ భూ నిర్వాసితులను మోసం చేసేందుకు కుట్రలు పొందుతున్నారని, ఈ ఎన్నికల లోపు పిఎన్ పబ్లికేషన్ ప్రకటించి ఇండ్లకు,భూములకు పరిహారం, ప్యాకేజి ఇవ్వకుంటే రెండు వేల మంది నిర్వాసితులతో మరో ఉద్యామానికి శ్రీకారం చుట్టడమే కాక డేంజర్ జోన్లో ఉన్న 4 వేల ఓట్లను సైతం బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. నిర్వాసితుల ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితులు ఇందారపు చెంద్రయ్య, కేశారపు చెంద్రయ్య, బండి స్వామి, ఆర్ని సత్తయ్య, అజ్మత్ అలీ, కేశారపు నరేశ్, శివ, సది, మొoడి, సారయ్యతో పాటు 200 మంది నిర్వాసితులు పాల్గొన్నారు.