గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో 20 గొర్రె పిల్లలు మృతి చెందిన ఘటన మంగళవారం మద్దికుంటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండెబోయి భాస్కర్ కు చెందిన గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో రూ, లక్ష రూపాయల విలువ గల గొర్రె పిల్లలు మృతి చెందాయి. పొద్దస్తమానం కుటుంబం కష్టపడి పెంచుకుంటున్న గొర్రెలు మృతి చెందడంతో కుటుంబం కన్నీరు మునిరయ్యారు. ప్రభుత్వం కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. సంఘటన స్థలాన్ని స్థానిక సర్పంచ్, బొమ్మిడి రామ్ రెడ్డి, గ్రామస్తులు గజ్జల చిన్నరాజు, దుంపల బాలరాజు, కుమ్మరి గంగరాజు, ముత్యాల రాజు, కుమ్మరి రాజశేఖర్, తదితరులు ఉన్నారు.