![ఆలయ అభివృద్ధికి భక్తుల విరాళం](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/lakshmivenkateswara-swamy-300x188.jpg)
నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ అభివృద్ధికి భక్తులు ఆదివారం విరాళాలు అందజేశారు. గ్రామానికి చెందిన కీర్తిశేషులు వీరమల్లి రమేష్ కుమారుడు భరత్ రాజ్ తన వంతుగా 11వేల రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను ఆలయ కమిటీ అధ్యక్షులు తాటిపల్లి సిద్ధిరాములు శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వామి, ఆలయ ధర్మకర్త రాజసింహారెడ్డి, నాయకులు బాబు రెడ్డి, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.