నవతెలంగాణ-భిక్కనూర్
భిక్నూరు పట్టణంలోని దక్షిణ కాశీ శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయ అభివృద్ధికి తిప్పాపూర్ గ్రామానికి చెందిన సిద్ధరామ్ రెడ్డి సూర్యప్రభ రిటైర్డ్ ఉపాధ్యాయులు 11,111 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి శాలువాతో సత్కరించి స్వామివారి ప్రతిమను, తీర్థప్రసాదాలు అందజేశారు.