– ఒక్కసారైనా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారా
– మిల్లర్ల మాఫియాను అరికట్టేది ఉందా లేదా?
– జెడ్పీ సమావేశంలో చైర్మన్ బండ నరేందర్ రెడ్డి
నవతెలంగాణ -నల్గొండ కలెక్టరేట్
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు పడే బాధ అంతా ఇంతా కాదని మిల్లర్లు ఇష్టం వచ్చిన కాడికి తరుగు తీస్తూ, దళారులు చెప్పిన వారి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ట్రాన్స్పోర్ట్ లోను నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని జెడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.రైతులు ధాన్యాన్ని విక్రయించడానికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే మిల్లర్లు ఇష్ట రితిగా వ్యవహరిస్తున్నారని అలాంటప్పుడు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. శనివారం జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి అధ్యక్షతన జడ్పీ సమావేశ మందిరంలో జెడ్పి 1, 2, 4, 7 వస్తాయి సంఘ సమావేశాలు, వైస్ చైర్మన్ ఇరిగి పెద్దలు అధ్యక్షతన 3వ స్థాయి సంఘ సమావేశం, నారా బోయిన స్వరూపారాణి ఆధ్వర్యంలో 6వ స్థాయి సంఘ సమావేశం జరిగాయి. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మాట్లాడారు. పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు సిండికేట్ గా మారి మిల్లర్లకు మద్దతు తెలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు నానా ఇబ్బంది పడుతున్నప్పుడు తమ వల్ల సమస్య పరిష్కారం కానప్పుడు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లాల్సిన అవసరం లేదా అన్నారు. ఇప్పటివరకు ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారని అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వం నుండి 2000 రూపాయలను తీసుకుంటూ, రైతులకు 1800 రూపాయలు మాత్రమే ఇస్తామని చెబుతున్నా మిల్లర్లకు ఎలా టెండర్లను అప్పగిస్తారంటూ మండిపడ్డారు. రైస్ మిల్లలది, ట్రాన్స్పోర్ట్ విషయంలో లారీలది ఓ మాఫియా నడుస్తుందని అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారని, అధికారులపై మిల్లర్లు అజమాయిషి చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు ధాన్యాన్ని పరిశీలించాక రైస్ మిల్లర్లు ఓ పక్క కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతూ కావలసినంత తరుగు తీస్తూ మరోపక్క తడిసిన దాన్ని కొనలేమని పేర్కొంటున్నారని మిల్లర్లకు బాధ్యత లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులను ఇబ్బందులను పెట్టే రైస్ మిల్లర్ల పై చర్యలు తీసుకోవాలని, వెంటనే విషయాని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో ఎన్ని బెల్ట్ షాపులు నడుస్తున్నాయో తెలపాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు.ఆరవ స్థాయి సంఘ చైర్ పర్సన్ నారా బోయిన స్వరూప రాణి మాట్లాడుతూ పేదలైన నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంటు పై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పలువురు జడ్పిటిసిలు మాట్లాడుతూ మిషన్ భగీరథ నీటిలో పురుగులు వస్తున్నాయని, త్రాగునీరు వచ్చే పైపులైన్లు లీకై నీరు కలుషితం అవుతుందని నీటి ట్యాంకులను శుభ్రం చేసిన దాఖలాలు లేవని అన్నారు. క్రమం తప్పకుండా ట్యాంకులను శుభ్రం చేయాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించారు. తిప్పర్తిలో పాఠశాలల ముందు నుండి మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ వెళ్ళిన సందర్భంలో మెయిన్ పైప్ లైన్ నుండి స్కూలు వైపు కనెక్షన్ ఇవ్వవలసిందిగా కోరారు. ఎల్ సి రాత్రి సమయంలో తీసుకువద్దని అలా చేయడం వల్ల రాత్రి సమయంలో దోమలు, పాముల వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఏమైనా సమస్యలు ఉంటే పగటి సమయంలో ఎల్ సి తీసుకోవాలని పేర్కొన్నారు. నారాయణపురం లో ఉండే మత్స్యకారులు గట్టుపల్ చెరువులో చేపలు పడుతున్నారని ఈ విషయాన్ని గతంలోనూ మత్స్యశాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లామని నారాయణపురం ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రాంతమని అక్కడి ప్రాంతం వారు నల్లగొండ జిల్లా ప్రాంతంలోని చెరువులలో చేపలు పట్టకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలోజడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి,జిల్లాలోని వివిధ శాఖల అధికారులుతదితరులు పాల్గొన్నారు.