– వేములవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్..
నవతెలంగాణ – వేములవాడ
గల్లీలో లొల్లి – ఢిల్లీలో దోస్తీ.. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటే..కొత్త రాగం – కొత్త పల్లవి.. వచ్చేవాళ్లు పట్నం నుంచిదిగుమతి అయిన నాయకులు.. నేను లోకల్, మీలో ఒక్కడిని మీ కష్టసుఖాల్లో ఉన్నవాడిని ఒకసారి అవకాశం ఇస్తే మీకు సేవ చేస్తానని, మీ ఋణం తీర్చుకునే అవకాశం నాకు కల్పించండి అని కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం వేములవాడ పట్టణంలో ముస్లిం, మైనార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న మైనార్టీ ముస్లిం పురుషులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. జనంలో వుండే నాయకుడు కావాలా, ఇతర నగరంలో వుండే నాయకుడు కావాలా మిరే తేల్చుకోండి అని తెలిపారు. మూడు నెల ముందు వచ్చేవాడు కావాల్నా… 30 ఏళ్ల నుంచి ప్రజల మధ్యలో ఉండే నాయకుడు కావాలా ఒక్కసారి ప్రజలారా ఆలోచించండి, బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కూడా ఒకటే గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ.. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం, ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ ఋణం తీర్చుకునే అవకాశం నాకు కల్పించండి అని అభ్యర్థించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుపైన ఓటు వేసి నన్ను ఆదరించాలని ఆయన మైనార్టీ సోదరీ సోదరీమణులను కోరారు, ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ నాలుగు సార్లు ఓడిన ప్రజల మధ్యలో ఉండే నాయకుడు నేనని అధికార పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థి గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఏ నాడు కూడా మనకు కనిపించని వ్యక్తి అందుబాటులో లేని వ్యక్తి కరోనా కష్టకాలంలో ప్రజలు తల్లాడుతుంటే ఇక్కడి ప్రాంత ప్రజలను పట్టించుకోని వ్యక్తి ఈరోజు వేములవాడలో పోటీ చేస్తామని వస్తుంటే మనం ఒక్కసారి ఆలోచించి వారికి తగిన రీతిలో ఓటు ద్వారా వాళ్లకు బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. మూడు నెలల ముందు వచ్చిన వ్యక్తి కావాలా 30 సంవత్సరాలు మన మధ్యలో ఉన్న మీ బిడ్డ మీ బీసీ బిడ్డ పేద బిడ్డ కావాలా ఒక్కసారి ఆలోచించండి నాలుగు సార్లు ఓడిన నేను ప్రజల మధ్యనే ఉన్న తప్ప ఏక్కడికి వెళ్ళిపోలేను ఓడినా గెలిచినా ప్రజలే మధ్యనే ఉన్న అని ఆయన అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12 శాతం రిజర్వేషన్ ముస్లింలకు కేటాయిస్తామని చెప్పి ఇంతవరకు కూడా రిజర్వేషన్ కల్పించకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి బిఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి న్యాయం చేయలేదు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి వారికి నివాసం కల్పించాంఅని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా మైనారిటీలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చాయ అని ఆయన ప్రశ్నించారు. మైనార్టీ పేద బడుగు బలహీన వర్గాలను ఆదుకునే పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. బిజెపి పార్టీ మతాల పేరిట ప్రాంతీయ ప్రాంతాల పేరిట విడదీయాలని చూస్తుందని అందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ ప్రాంతాల పేరుతో మతాల పేరిట మమ్మల్ని విడదీయరాలని ఆయన ఒక సూచనగా చేశారన్నారు. వేములవాడ పట్టణంలో షాది ఖానా, ఉర్దూ మీడియం ,కబ్రాహాసన్ ప్రహరీ గోడ మైనార్టీలకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను నేను గెలిచిన వెంటనే ఆ సమస్యలన్నీ తీరుస్తానని ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే పథకాలు పోతాయని బెదిరింపులు..
కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే పథకాలు పోతాయని కొందరు మైనారిటీ వ్యక్తులు కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువచ్చారు. నిజామాబాద్ జిల్లాలో ఎంపీగా పోటీ చేసిన కవిత ఓడిపోతే పథకాలు ఆగిపోయాయి, కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిన బోయిన్పల్లి వినోద్ పోటీ చేసి ఓడిపోయిన ఎక్కడైనా సంక్షేమ పథకాలు ఆగయా అని తెలిపారు, పథకాలను ఏ ప్రభుత్వమొచ్చిన తప్పకుండా అమలు చేయాల్సిందేనని వారికి తెలిపారు. ఎవరైనా అలా బెదిరిస్తే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని వారికి సూచించారు. ఫాజుల్ నగర్ లో ఓ కాలనీలో గడపగడపకు ప్రచారంలో భాగంగా వెళ్లగా కొందరు ముస్లిం మహిళలు నీళ్లు రావడం లేదని దృష్టికి తీసుకురావడంతో వెంటనే జిల్లా కలెక్టర్ తెలియజేయడంతో హుటాహుటిన సిబ్బందిని పంపించి మంచి నీళ్లు వచ్చేలా చూశారని తెలిపారు. ఇదే అధికారంలోకి వస్తే మీ అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, మాజీ ఎంపిపి రంగు వెంకటేష గౌడ్, సంఘ స్వామి యాదవ్, ఎర్ర శ్రావణ్, కూరగాయల కొమరయ్య, కనికరపు రాకేష్, కోలాకాని రాజు, నాగుల రాము గౌడ్, వస్తాది కృష్ణ ప్రసాద్ గౌడ్, మైనార్టీ నాయకులు రజాక్, సాబీర్, యూసుఫ్, అన్వర్, చాంద్ ఫెరోజ్, రెహమాన్, రిజ్వాన్, యూసుఫ్, యూనుఫ్, ముస్లిం మైనార్టీ సోదర సోదరిమనులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.