నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మొదటి నుంచి ట్విస్టులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈడీ.. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపించింది. ఈ సందర్బంగా రేపే విచారణను రావాలని నోటీసుల్లో పేర్కొనడం గమనార్హం. అయితే, ఈ కేసులో అరుణ్ రామచంద్రపిళ్లై నిన్ననే అప్రూవర్గా మారారు. ఈ విషయంలో ఆయన ప్రత్యేక జడ్జి ఎదుట వాంగ్మూలం ఇవ్వగా దాన్ని ఈడీ అధికారులు రికార్డు చేసినట్లు సమాచారం. లిక్కర్ స్కాం కేసులో గత ఏడాది మార్చి 7న అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన నుంచి పలు అంశాలు రాబట్టారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ ప్రకటించి.. ఎన్నికలకు సిద్ధం అయిన క్రమంలో.. కవితకు మళ్లీ ఈడీ నోటీసులు పంపించటం అనేది చర్చనీయాంశం అయ్యింది.
2023, మార్చి 16, 20, 21 తేదీల్లో మూడు రోజులు కవితను రోజంతా విచారించారు. అప్పట్లో ఉదయం ఈడీ ఆఫీసుకు వెళ్లిన కవిత.. రాత్రి ఎనిమిది, తొమ్మిది గంటల వరకు ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. కవిత విచారణ ముగిసింది అనుకుంటున్న సమయంలో.. మళ్లీ విచారణకు పిలవటం బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశం అయ్యింది. ఈడీ నోటీసులు అందుకున్న కవిత.. ఈడీ చెప్పిన.. పిలిచిన సమయానికి హాజరు అవుతారా లేదా అనేది ఇంట్రస్టింగ్ పాయింట్..