– ఎంపీపీ జంగం శ్రీనివాస్
నవతెలంగాణ-పెద్ద శంకరంపేట్
గ్రామాల అభివద్ధికి అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి కషి చేయాలని పెద్ద శంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్ అన్నారు. బుధవారం పెద్ద శంకరంపేటలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజా ప్రతినిధులు అధికారులు గుర్తించి వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్ర మంలో వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, ఎంపీటీసీ లు దత్తు, వీణ, సుభాష్ గౌడ్ , దామోదర్, కళాలి, మానస, స్వప్న, రాజేశ్వర్, కో ఆప్షన్ సభ్యులు యడుల్, ఎంపీడీవో రఫిక్ ఉన్నిసా, సూపరిండెంట్ షాకీర్, ఆయా గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.