– ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేణుగోపాల్
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
సమగ్ర శిక్ష పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులం దరినీ రెగ్యులరైజ్ చేయా లని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. వారం రోజులుగా తమ డిమాండ్ల సాధన కోసం వికారా బాద్ జిల్లా కేంద్రంలో చేస్తున్న ధర్నా శిభిరానికి నేడు హాజరై సంఘీబావం తెలిపారు. వారి డిమాండ్లకు మద్దతు పలికారు. 12 సంవత్సరాలుగా చాలీచాలని జీతం తో రాష్ట్రస్థాయి నుంచి స్థానిక స్కూలు స్థాయి వరకు వివిధ హౌదాలలో పని చేస్తూ విద్యాభివృ ద్ధిలో కీలకంగా ఉన్నారని వారు వివరించారు. జిల్లా అధ్య క్షులు పవన్ కుమార్ మాట్లడుతూ వీరందరికీ ఎలాంటి బెనిఫిట్స్ లేవని రాష్ట్ర ప్రభుత్వం కాం ట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించి ఇప్పటికే కొంతమందిని రెగ్యులరైజ్ చేసిందని వారు తెలిపారు. సమగ్ర శిక్ష పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ఉద్యోగ భద్రత ఇస్తూ వారికి మినిమం స్కీలును తాత్కాలికంగా అమలు చేయాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చీ. శ్రీని వాస్రావ్ మాట్లాడుతూ..జీవిత బీమా, ఉద్యోగ నియ మకాల్లో 30 శాతం వెయిటేజీ ఇవ్వాలని తెలిపారు. మహిళా ఉద్యోగులకు 180 రోజులు ఇవ్వాలని వికలాంగులకు అలవెన్స్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.