నవతెలంగాణ- తాడ్వాయి
విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని బాలుర ఆశ్రమ పాఠశాల కొడిశెల హెచ్ఎం సుతారి రమేష్ అన్నారు. మంగళవారం మండలంలోని బంధాల, కోడిశెల, లింగాల, బొడ్డుగూడెం గ్రామాల్లో విద్యార్థులకు తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలని, ‘బడిబాట’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కోడిశెల ఆశ్రమ పాఠశాల హెచ్ఎం సుతారి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి ఫీజులు, రుసుము లు లేకుండా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ లు, పౌష్టికాహారం ఏకరూప దుస్తులు అందిస్తామని అన్నారు. కొడిశెల ఆశ్రమ పాఠశాలలో గత పది సంవత్సరాల నుండి రిజల్టు మండల టాపర్లుగా నిలిచారని పేర్కొన్నారు. అందరూ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పేర్కొన్నారు. ఆయన వెంట ఉపాధ్యాయులు రవీందర్ సుధాకర్ శేషగిరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.