నవతెలంగాణ-కొత్తగూడ: ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటరు జాబితాలో ఉన్న తప్పు ఒప్పులను సరిచేయాలని తహసిల్దార్ రమాదేవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బిఎల్ఓ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరణించిన వ్యక్తుల జాబితా, రెండు ఓట్లు కలిగిన వ్యక్తుల జాబితాను, వాటివివరాలను అందజేయాలన్నారు. రెండు మూడు తేదీలలో పోలీస్ స్టేషన్లో ఉండి 18 సంవత్సరాల పైబడిన వారి నుండి అప్లికేషన్లు తీసుకోవాలని బిఎల్ఓ లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఐ గిరిబాబు, ఎంపీఎస్ఓ రమేష్, జూనియర్ అసిస్టెంట్లు సాంబయ్య, పాపారావు, మండల పరిధిలోని బిఎల్ఓ లు తదితరులు పాల్గొన్నారు.