నవతెలంగాణ; బోధన్ టౌన్
బోధన్ టౌన్ నూతన ఎస్సైగా పాండేరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఎస్సై మాట్లాడుతూ.. బోధన్ నియోజక వర్గంలోని ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే అందుబాటులో ఉండి మెరుగైన సేవలందిస్తానన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రజలకు ఏమైన సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పలువురు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.