‘పూర్తి వినోదం, మాస్ అంశాలతో ఆద్యంతం ప్రేక్షకులను సమ్మోహన పరిచే విధంగా ‘ఉపేంద్ర గాడి అడ్డా’ చిత్రం రూపొందింది’ అని నిర్మాత కంచర్ల అచ్యుతరావు తెలిపారు.
కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కష్ణ హీరోయిన్గా ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్.ఎస్.ఎల్.ఎస్. క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, ‘మొదట్నుంచి నాకు సినిమా పిచ్చి ఉండేది. విడుదలైన అన్ని సినిమాలు చూస్తూండే వాడ్ని. అయితే నేను ఇతర వ్యాపార రంగాలలో బిజీ కావడంతో ఇంతకాలం సినిమా రంగంలోనికి ప్రవేశించలేదు. సినీ హీరో కావాలన్న మా అబ్బాయి ఉపేంద్ర తష్ణను గమనించి, అతనిని హీరోగా పరిచయం చేస్తూ ఐదు సినిమాలను మొదలు పెట్టాం. అవన్నీ వివిధ దశలలో ఉన్నాయి. ఐదవ సినిమాగా మొదలు పెట్టిన ఈ సినిమా చాలా వేగంగా పూర్తయ్యింది. అంతేకాదు మొదటి సినిమాగా మీముందుకు వస్తోంది. మేము తీస్తున్న మిగిలిన సినిమాలను ప్రతీ నెలా ఒక సినిమా చొప్పున విడుదల చేస్తాం’ అని చెప్పారు.
‘థియేటర్ సీట్లో కూర్చున్న ప్రేక్షకుడు నవ్వు ఆపుకోలేక పొట్ట చెక్కలయ్యే విధంగా వినోదం ఉంటుంది. అలాగే మాస్ అంశాలు యువ హదయాలను అద్భుతంగా అలరింపజేస్తాయి. సోషల్ మీడియా నేటి సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో తెలియంది కాదు. దానివల్ల చెడు మార్గాన్ని ఎంచుకోకుండా, మంచిని పెంపొందింపజేస్తే సమాజం మరింత వికాస వంతం అవుతుందన్న సందే శాత్మక పాయింట్ను కూడా ఇందులో ఆవిష్కరించాం. నిర్మాత, హీరో ఇచ్చిన సంపూర్ణ స్వేచ్ఛ, సహకారంతో సినిమాని అనుకున్న విధంగా తెరకెక్కించాను’ అని దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. అన్నారు.
హీరో కంచర్ల ఉపేంద్ర మాట్లాడుతూ, ‘నా జిజ్ఞాసను గమనించి, మా నాన్న నన్ను హీరోగా పెట్టి ఒక సినిమా కాదు, ఐదు సినిమాలు తీస్తుండటాన్ని నేను అదష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది. కంటెంట్ బాగుంటే చిన్న సినిమానా లేక పెద్ద సినిమానా అని ప్రేక్షకులు చూడటం లేదు. బాగా ఆదరిస్తు న్నారు. ఆ కోవలో ఉండే సినిమా ఇది’ అని అన్నారు. హీరోయిన్ సావిత్రి కష్ణ మాట్లాడుతూ, ‘ఇలాంటి చక్కటి చిత్రంలో నటించటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.