నవతెలంగాణ -డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పిజి -ఎపిఈ/ఐపిసిహెచ్(5 వైఐపిజిపి) 8వ,10వ సెమిస్టరు రెగ్యులర్,బ్యాక్ లగ్ థియారీ పరీక్షలు జులై 18 నుంచి ప్రారంభమవుతాయని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్ అరుణ గురువారం రీ షెడ్యూల్ విడుదల చేశారు.ఈ పరీక్షలు యూనివర్సిటీ కళాశాల,మెయిన్ క్యాంపస్ లో జరుగుతాయని అరుణా పేర్కొన్నారు. సంబంధిత విద్యార్థులు పరీక్ష తేదీల వివరాలను సరిచూసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు www.telanganauniversity.ac.in వెబ్ సైట్ సంప్రదించాలని కోరారు.