![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG-20230925-WA0036-300x300.jpg)
నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ నియోజకవర్గలోని గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ కల్తీ మద్యం అమ్మకానికి పాల్పడుతున్న ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని టిడిపి హుస్నాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ బత్తుల శ్రీనివాస్ ఆరోపించారు. ప్రభుత్వం ముందస్తుగా వైన్స్ లకు టెండర్ల అనుమతి ఇవ్వడంతో బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యం ఏరులై పారుతోందన్నారు. ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని,ఎన్ని సార్లు పిర్యాదులు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. కల్తీ మద్యం తాగి గ్రామంల్లో ఉన్న పేదవారు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల బాధలు భరించలేక కొందరు ప్రాణాలు కోల్పోతునరని, ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు కళ్ళు తెరిచి గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపుల్లో జరుగుతున్న కల్తీ మద్యన్ని నివారించాలని డిమాండ్ చేశారు . హుస్నాబాద్ లోని వైన్స్ షాపులని తనిఖీ చేసి, కల్తీ మద్యం అమ్మకాలు జరిపిన షాపుల లైసెన్స్ రద్దు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.