నవతెలంగాణ – హైదరాబాద్: ఉప్పల్లో నకిలీ జడ్జి నామా నరేందర్రెడ్డిని ఈ రోజు పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టులో భూ వివాదం కేసు పరిష్కారం పేరుతో సోమిరెడ్డి వద్ద రూ.10లక్షలు తీసుకుని మోసం చేశారు. కేసు పరిష్కారం కాకపోవడంతో బాధితుడు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నరేందర్రెడ్డితో పాటు అతని అనుచరుడు సుదర్శన్రెడ్డిని అరెస్టు చేశారు.