నవతెలంగాణ- పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం లో స్వల్పకాలిక రుణాలు మాఫీ అయిన సభ్యులకి 36 మంది రూ.27,55,000నూతన సభ్యులు 60 మంది రూ.30,72,500 సభ్యులకి స్వల్పకాలిక మంజూరు కావడం జరిగింది సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాణిజ్య బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకే సహకార సంఘాలు రుణాలు మంజూరు చేస్తున్నాయన్నారు. సొసైటీలో రుణాలు పొంది వ్యవసాయం చేసుకుని దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని తిరిగి మళ్లీ కట్టినట్టయితే రైతుల ద్వారా వచ్చిన వడ్డీల ద్వారా సహకార సంఘాలు అభివృద్ధి జరుగుతాయని తీసుకున్న రుణాలు తిరిగి కట్టడం ద్వారా మళ్లీ ఎవరికైనా రుణాలు పొందే అవకాశం ఉంటుందని తీసుకున్నవారు రుణాలను సకాలంలో చెల్లిస్తే మళ్లీ రుణం పొందే అవకాశం ఉంటుందన్నారు.ఈ కార్య క్రమంలో అధ్యక్షులు కె హన్మంతు రెడ్డి,డైరక్టర్ సాయగౌడ్, దస్తారెడ్డి,సర్పంచ్ తిరుమల రెడ్డి,భుషప్ప, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఖండెరావు పటేల్, సెక్రటరీ సందీప్ కుమార్,సంఘ సభ్యులు పాల్గొన్నరు.