నవ తెలంగాణ- మునుగోడు:
రైతులు ఆరుకాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు విక్రయించుకునేందుకు ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మునుగోడు డి. ఎల్లయ్య ,వ్యవసాయ సహాయ సంచాలకులు నాబార్డు డిడిఎం వినయ్ కృష్ణ కోరారు . బుధవారం మండలంలోని సింగారం గ్రామంలో సాహిత రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో రైతులను మోసం చేసేందుకు దళారులు బాగా వేసి ధాన్యమును కొనుగోలు చేస్తామని మాయమాటలు చెప్తే రైతులు విని దళారుచేతుల్లో మోసపోవద్దని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఎం. నరసింహ, సాహిత రైతు మిత్ర గ్రూపు రామ్మూర్తి, రాంబాబు, డైరెక్టర్లు మల్లేష్ , మారేష్ , సుధీర్ రెడ్డి, గ్రామ రైతులు పాల్గొన్నారు.