నవతెలంగాణ-హైదరాబాద్ : తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.