– ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొన్న తుఫాన్ బొలెరో వాహనం..16 మందికి గాయాలు
నవతెలంగాణ – తిమ్మాపూర్
తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న ట్రాక్టర్ ను తుఫాన్ బొలెరో వాహనం ఢీకొన్న సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది పోలీసుల వివరాల ప్రకారం…కాళేశ్వరం దైవ దర్శనానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వెళుతున్న దాదాపు 15 మంది ఉన్న తుఫాన్ వాహనం డ్రైవర్ అజాగ్రత్తగా అతివేగంగా నడుపుతూ కొత్తపెల్లి గ్రామ శివారులో ఆగి ఉన్న ట్రాక్టర్కు ఢీ కొట్టి అదుపుతప్పి ప్రక్కన ఉన్న తెలంగాణ పాల డైరీ కాంపౌండ్ కు గుద్దుకొని చొచ్చుకొని పోయింది. తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న సోమయ్య, లక్ష్మీ, భాగ్యమ్మ సత్యనారాయణ మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇట్టి ప్రమాదంలో తుఫాన్ వాహనము డ్రైవర్ అయినా కంచర్ల రవికి బలమైన గాయాలు అయ్యయి. మరికొందరు పిల్లలకు స్వల్ప గాయాలు అయ్యాయి.సమాచారం అందుకున్న ఎల్ఎండి ఎస్ఐ ప్రమోద్ రెడ్డి సిబ్బందితో ప్రమాద స్థలానికి హుటాహుటిన చేరుకొని గాయాలు అయిన వారిని అంబులెన్స్ లో కరీంనగర్ హాస్పిటల్ కు తరలించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ట్రాక్టర్ వాహనమును ప్రక్కకు తీసారు. ప్రమాద సంఘటనపై ఎల్ఎండి ఎస్ఐ ప్రమోద్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.