![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/08/IMG-20230805-WA0529.jpg)
నవతెలంగాణ- తాడ్వాయి
ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలకు జంపన్న వాగు ఉధృతికి నార్లాపూర్ గ్రామంలో కిరాణం షాప్ యజమాని బచ్చు సుబ్బారావు కిరాణం షాపు పూర్తిగా మునిగిపోయి అన్ని వస్తువులు ధ్వంసం అయ్యాయి. శనివారం సీనియర్ సిటిజన్స్ నర్సంపేట వారు, ములుగు జిల్లా ఆర్యవైశ్య మహాసభ సిద్ధంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 40 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యానికి ఇంత బీభత్సం జరగడం బాధాకరం అన్నారు. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే వరద బాధిత కుటుంబాలకు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఆర్యవైశ్య మహాసభ వర్కింగ్ కమిటీ సెక్రెటరీ సిద్ధంశెట్టి లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు సిద్ధంశెట్టి వైకుంఠం, తాడ్వాయి ఆర్యవైశ్య మండల మహాసభ మండల అధ్యక్షులు పాలడుగు చంద్రశేఖర్, మంగపేట మండల అధ్యక్షులు అనంతుల కృష్ణమూర్తి, సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు ఇరుకుల్ల లక్ష్మయ్య, కార్యవర్గ సభ్యుడు వజినపల్లి వీరలింగం, వెంకటేశ్వర్లు, వంగేటి గోవర్ధన్,శ మర్చినపల్లి ఉపేందర్ పబ్బా రమేష్, తాటికొండ రాము, తదితరులు పాల్గొన్నారు.