నవతెలంగాణ- రామారెడ్డి: మండలంలోని మద్దికుంట గ్రామానికి చెందిన బాధిత కుటుంబాలకు బుధవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆదేశాల మేరకు స్థానిక నాయకులు కామారెడ్డిలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గ్రామానికి చెందిన కొడగండ్ల లత అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తెలుసుకొని రూ 25000, అదే గ్రామానికి చెందిన బెస్త కీర్తన మతిస్థిమితంతో బాధపడుతూ, కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో రూ 5000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాధ్యత కుటుంబాలు గంప గోవర్ధన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బొమ్మిడి రామ్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు తోటరాజు, కోమటి శాల మార్కండేయులు తదితరులు ఉన్నారు.