నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయం ముందు గత ఇరువై ఏడు రోజులుగా చేస్తున్న సమ్మేకు మద్దతుగా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ.. ముప్పై జీపీల పారిశుద్ద్య కార్మీకులు మరియు ఇతర కార్మీకుల సమ్మేకు ఆర్థికంగా ఆదుకునేందుకు పలు జీపీల సర్పంచులు ముందుకు వచ్చారు. ఈ సంధర్భంగా వజ్రఖండి సర్పంచ్ సంజీవ్ పాటీల్ రూపాయలు 5వేలు ఇచ్చి తామున్నామని, జీపీ కార్మీకులు దైర్యంగా ఉండాలని సూచించారు. డోన్గాం సర్పంచ్ గజిరే కళావతి తమవంతుగా 3వేల రూపాయలు అందించి జీపీ కార్మీకులు ఎక్కువగా ఎస్సీ, బీసీలే ఆర్థికంగా వెనుకబడిన వారు కావడం ఉన్నారు వారికి భరోసా కల్పించారు. పెద్ద గుల్లా సర్పంచ్ రుక్మినిబాయి విఠల్ పటేల్ 2వేల రూపాయల నగదును మంగళ వారం అందించారు. న్యాయమైన డిమాండ్లు కోరకు జీపి కార్మీకుల చేస్తున్న సమ్మేకు తమవంతుగా ఎప్పుడు ముందుకు వచ్చి సహయం చేస్తామని, సంపూర్ణ మద్దతు ఉంటుందని వజ్రఖండి, డోన్గాం, పెద్దగుల్లా గ్రామపంచాయతిల సర్పంచులు పేర్కోన్నారు. కార్య క్రమంలో నాయకులు గజిరే రాజు, విఠల్ పటేల్, జీపీ కార్మీకులు తదితరులు పాల్గోన్నారు.