నవతెలంగాణ బెంగళూరు: ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్(Bigg Boss) సీజన్-10(కన్నడ)లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. హౌస్ లో కంటెస్టెంట్ గా ఉన్న వర్తుర్ సంతోష్ (Varthur Santosh)ను హౌస్ లోనే అటవీశాఖ అధికారులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. హౌస్ లోపలికి వెళ్లి మరీ హౌస్ మెంట్ ను అరెస్ట్ చేయడం బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారి. పులిగోరు ధరించి ‘బిగ్ బాస్’లో పాల్గొన్న సంతోష్ పై పలువురు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన అటవీశాఖ అధికారులు వర్తుర్ సంతోష్ ను అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి మరీ సతీష్ ను అరెస్ట్ చేయడం సంచలనం రేపింది.
వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించినట్టు సంతోష్ పై కేసు నమోదుకాగా.. తొలుత బిగ్ బాస్ నిర్వాహకులు అతడ్ని అప్పగించడానికి నిరాకరించారు. ఆ తర్వాత అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్ట్ చేసేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. సంతోష్ ప్రస్తుతం రామోహళ్లి ఫారెస్ట్ అధికారుల కస్టడీలో ఉన్నారు. పులిగోరును కొనుగోలుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు అతని పై చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. బెంగుళూరు ఫారెస్ట్ | ప్రొటెక్షన్ ఆఫీసర్ రవీంద్ర మాట్లాడుతూ.. విచారణ అనంతరం అతన్ని న్యాయస్థానం ఎదుట హాజరు పరుస్తామని తెలిపారు.