నవతెలంగాణ- కంటేశ్వర్
అక్టోబర్ 2న కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకల లో భాగంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆదివారం నాందేవ్ వాడలోని కెవిపిఎస్ ప్రధాన కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేశారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ గంగాధర్ మాట్లాడుతూ..కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ 1998 అక్టోబర్ 2న ఆత్మగౌరవం సమానత్వం కుల నిర్మూలన అనే లక్ష్యసాధన కోసం ఒక చారిత్రక అవసరంగా ఏర్పడింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం దళితులకు రెండు ఎకరాల భూమి స్మశాన వాటికస్థలం ఇవ్వాలని జీవో నెంబర్ 1235 దళితులకు100 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇవ్వాలని జీవో నెంబర్ 348 సాధించింది రాజ్యాంగ రక్షణ రిజర్వేషన్లు పరిరక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవాలని ప్రజాస్వామ్యం లౌకితత్వం సామాజిక న్యాయం మతసామరస్యత టెర్రరిజం వంటి రాజ్యాంగ మూల స్తంభాల రక్షణ కోసం కెవిపిఎస్ నిరంతరం కొనసాగుతుంది రెండు గ్లాసుల పద్ధతికి వ్యతిరేకంగా పోరాడి.మహానీయుల జ్యోతిబాపూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత పరిరక్షణ కోసం పూర్తిగా ప . నిచేస్తుంది కాబట్టి ఈరోజు నిజామాబాద్ కెవిపిఎస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించుకోవడం జరిగింది కాబట్టి ఎల్లవేళలా సామాజిక పోరాటాలకు అండగా ఉంటదానితెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో భాస్కర్, కురం పోసెట్టీ, రాజు, నెహ్రూ, రఘు, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.